Powered By Blogger

Thursday, September 30, 2010

అయోధ్య తీర్పు - అపూర్వం.


అరవై  సంవత్సరాలుగా కోర్ట్ లో నలిగిన తర్వాత అయోధ్య పై వెలువడిన తీర్పు దాదాపు గా  అందరినీ సంతోష పెట్టింది.
అలహాబాదు కోర్టు తీర్పు వెలువరించగానే, ఇరు మతస్తులు కొట్టుకు చస్తారనీ , చూసి సంతోషించొచ్చని
కోరుకున్న వాళ్లకు నిరాశే మిగిలింది. 
మన పొరుగు దేశం లో ఒకే మతస్తులే ఇమడ లేక తన్నుకుంటుంటే ,
"భిన్నత్వం లో ఏకత్వం" కేవలం మాటలకే కాదు చేతల్లో కూడా చూపించగలమని భారత పౌరులు  నిరూపించారు.
 మతసంస్తలే కాకుండా, రాజకీయ పార్టీలు కూడా ఈ తీర్పుని స్వాగతించడం ఆశ్చర్యకరమైనా, శుభపరిణామం.
హిందూ ముస్లిం భాయీ భాయీ అంటూ చేతులు కలిపిన తీరు ప్రపంచ దేశాలకు భారత్ నిజమైన ప్రజాస్వామ్య దేశమనీ,
విభేదాలు రాజకీయ పార్టీల సృష్టే తప్ప సామాన్యులందరూ  ఎప్పుడూ ఒకటేనని మరోసారి రుజువు చేసింది.

కామెంట్స్ ప్లీజ్
- శశిధర్ సంగరాజు.

No comments: