Powered By Blogger

Monday, December 31, 2012

బ్లాగ్ మిత్రులందరికీ, 

నూతన సంవత్సరంలో, మీకు మరియు మీ ఆప్తులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను, సుఖశాంతులను ప్రసాదించాలని
ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ...

శశిధర్ సంగరాజు & ఫ్యామిలీ

Tuesday, July 17, 2012

మధుయాష్కీ తో నేను


పదిరోజుల క్రితం,  నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ లూయివిల్, కెంటకీ కి వచ్చారు. "ఇండో-అమెరికన్ వ్యాపార సంబధాలు" పర్యటనలో భాగంగా మా ఊరు రావడం జరిగింది. 


మా తెలుగు అసోసియేషన్ సభ్యులం,  కలవడానికి వెళ్ళాం. ఫోటోలు తీయించుకున్నాం. ఇండియాలో అయితే, ఎంపీ స్థాయి వ్యక్తులను కలిసి మాట్లాడాలంటే, కొంచెం కష్టమేమో. ఇక్కడ మాత్రం భేషజాలేమీ లేకుండా బాగానే మాట్లాడాడు. పైగా,  మా సంస్థ చైర్మన్ డాక్టర్ విజయకృష్ణ, మధుయాష్కీ ఇద్దరూ బాల్యస్నేహితులు కావడం కూడా బాగా కలిసొచ్చింది. ఇదుగోండి, మధుయాష్కీ తో కలసి తీయించుకున్నఫోటో.


 ఒక మొక్కుబడి ఉంటే, ఈ మధ్యన పిట్ట్స్ బర్గ్ వెళ్ళి, వెంకటేశ్వరస్వామికి తలనీనాలు సమర్పించి వచ్చాను. అదీ నా గుండు గెటప్ వెనకాల కథాకమామీషు. 


స్థానిక "తాజ్ పాలెస్" రెస్టారెంట్ లో ఆయన్ను కలిసాము. మరాఠీ, గుజరాతీ, పంజాబీ కంమ్యూనిటీ వాళ్ళు కూడా వచ్చారు. మధు, తెలుగు వాళ్ళతో కాస్త ఎక్కువ సమయం గడిపారు. స్వతహాగా లాయర్ కూడా కావడంతో, కొంతమంది అడిగిన ఇమ్మిగ్రేషన్ సంభందిత విషయాలు కూడా బాగానే మాట్లాడారు. ఎన్నారైలను ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడం పర్యటన ఉధ్ద్యేశ్యం. 


తెలుగోళ్ళం (పనికిమాలిన)రాజకీయాల గురించీ, గుజరాతీ బ్యాచ్,  వ్యాపారాలు/పెట్టుబడుల గురించీ, మరాఠీ వాళ్ళు ఎవరికీ అర్థం కాకుండా ఏదో విషయం గురించి ప్రశ్నలు అడిగాం.

 

మేమంతా రాష్ఱ్రంలో పెరుగుతున్న అవినీతి గురించి మరొక్కసారి తీవ్రంగా బాధపడి, ఇంకో రెండు రస్మలాయిలు అదనంగా లాగించి ఇళ్ళకు చేరుకున్నాం. అదీ సంగతి. 


~శశిధర్ సంగరాజు. 



Monday, April 2, 2012

లూయివిల్ లో ఉగాది సందడి


ఏప్రిల్ 1  వ తేదీ సాయంత్రం మా ఊర్లో (లూయివిల్  ) లో తెలుగువారందరూ కలసి ఉగాది వేడుకలు జరుపుకున్నాము. ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో మా అబ్బాయి రెండు డాన్సు ఈవెంట్స్ లో పాల్గొన్నాడు.  నేను పత్రికలకు పంపిన చిన్న రైట్ -అప్ కూడా కింద ఇస్తున్నాను.  
*****************************************************
కెంటకీ రాష్ట్రంలోని లూయివిల్ నగరంలో ప్రవాస భారతీయులు ఉగాది సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ కెంటకియానా (టాక్) ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు విరివిరిగా పాల్గొని పరస్పరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ పుష్పలత పావులూరి మాట్లాడుతూ, విదేశాల్లోని తెలుగువారంతా తమ సంస్కృతీ సంప్రదాయాలను మరచిపోకుండా ప్రతి సంవత్సరం ఇలాంటి పండుగలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. సంస్థకు విరాళాలు అందజేసిన దాతలను సభకు పరిచయం చేసి అభినందించారు.

ఈ సందర్భంగా పలు సాంస్క్రతిక కార్యక్రమాలు జరిగాయి. సినీ గీతాలకు చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీమతి సుప్రియ నృత్య దర్శకత్వంలో 22 మంది చిన్నారులు ప్ర్రదర్శించిన "శ్రీకృష్ణ లీలలు", బాబు కొండవీటి బృందం ప్రదర్శించిన "భీష్మ , కర్ణ, దుర్యోధన సంవాదం", డాక్టర్ రాజశేఖర్ లక్కరాజ్ ఆలపించిన సినీగీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఫ్రాంక్ ఫర్ట్ కుర్రాళ్ళు ప్రదర్శించిన నృత్యాలు ఆహూతులను ఉర్రూతలూగించాయి.
కార్యక్రమానికి రఘు, స్వరూప్, భార్గవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

కార్యక్రమం విజయవంతంగా జరగడానికి కృషి చేసిన ఎగ్జిక్యూటివ్ కమిటీని సంస్థ చైర్మన్
డాక్టర్ విజయకృష్ణ అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు బహుమతి ప్రదానం జరిగింది.
అనంతరం అతిధులకు తెలుగు వంటకాలతో కూడిన విందుభోజనం అందించారు.
************************************************
                             
                                       (గణపతి ప్రార్థన)
                                   
                                        (శ్రీ కృష్ణ  లీలలు నృత్య రూపకం)
                           
                                          (కర్ణ, దుర్యోధన, భీష్మ సంవాదం)
                                          (సాకేత్ మెడ్లీ - 1)

                                          (సాకేత్ మెడ్లీ - 2 )


~శశిధర్ సంగరాజు



Sunday, January 1, 2012

నూతన సంవత్సర శుభాకాంక్షలు

బ్లాగ్ మిత్రులందరికీ ,
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కొత్త సంవత్సరంలో  మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ 
సర్వ శుభాలు చేకూరాలని ఆశిస్తూ...


~శశిధర్ సంగరాజు