Powered By Blogger

Tuesday, July 17, 2012

మధుయాష్కీ తో నేను


పదిరోజుల క్రితం,  నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ లూయివిల్, కెంటకీ కి వచ్చారు. "ఇండో-అమెరికన్ వ్యాపార సంబధాలు" పర్యటనలో భాగంగా మా ఊరు రావడం జరిగింది. 


మా తెలుగు అసోసియేషన్ సభ్యులం,  కలవడానికి వెళ్ళాం. ఫోటోలు తీయించుకున్నాం. ఇండియాలో అయితే, ఎంపీ స్థాయి వ్యక్తులను కలిసి మాట్లాడాలంటే, కొంచెం కష్టమేమో. ఇక్కడ మాత్రం భేషజాలేమీ లేకుండా బాగానే మాట్లాడాడు. పైగా,  మా సంస్థ చైర్మన్ డాక్టర్ విజయకృష్ణ, మధుయాష్కీ ఇద్దరూ బాల్యస్నేహితులు కావడం కూడా బాగా కలిసొచ్చింది. ఇదుగోండి, మధుయాష్కీ తో కలసి తీయించుకున్నఫోటో.


 ఒక మొక్కుబడి ఉంటే, ఈ మధ్యన పిట్ట్స్ బర్గ్ వెళ్ళి, వెంకటేశ్వరస్వామికి తలనీనాలు సమర్పించి వచ్చాను. అదీ నా గుండు గెటప్ వెనకాల కథాకమామీషు. 


స్థానిక "తాజ్ పాలెస్" రెస్టారెంట్ లో ఆయన్ను కలిసాము. మరాఠీ, గుజరాతీ, పంజాబీ కంమ్యూనిటీ వాళ్ళు కూడా వచ్చారు. మధు, తెలుగు వాళ్ళతో కాస్త ఎక్కువ సమయం గడిపారు. స్వతహాగా లాయర్ కూడా కావడంతో, కొంతమంది అడిగిన ఇమ్మిగ్రేషన్ సంభందిత విషయాలు కూడా బాగానే మాట్లాడారు. ఎన్నారైలను ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడం పర్యటన ఉధ్ద్యేశ్యం. 


తెలుగోళ్ళం (పనికిమాలిన)రాజకీయాల గురించీ, గుజరాతీ బ్యాచ్,  వ్యాపారాలు/పెట్టుబడుల గురించీ, మరాఠీ వాళ్ళు ఎవరికీ అర్థం కాకుండా ఏదో విషయం గురించి ప్రశ్నలు అడిగాం.

 

మేమంతా రాష్ఱ్రంలో పెరుగుతున్న అవినీతి గురించి మరొక్కసారి తీవ్రంగా బాధపడి, ఇంకో రెండు రస్మలాయిలు అదనంగా లాగించి ఇళ్ళకు చేరుకున్నాం. అదీ సంగతి. 


~శశిధర్ సంగరాజు.