సెప్టెంబర్ 28 2010, రాత్రి 10 :45 EST
బహుశా, నేను ఈ ఐటెం రాసే సమయానికి ఆయేషా మీరా హత్య కేసులో కోర్ట్ తీర్పు ఇవ్వడం మొదలు పెట్టే ఉంటుంది.
ఇంతకు ముందే టీవీ లో ఆయేషా తల్లిదండ్రుల ఇంటర్వ్యూ చూసాను.
తమ కూతురు హత్య జరిగి ౩ సంవత్సరాలు గడచిన తర్వాత వెలువడుతున్న కోర్ట్ తీర్పు కూడా తమకు న్యాయం
చెయ్యదనీ, పోలీసు, న్యాయ వ్యవస్థ లు కుమ్మక్కు అయ్యాయనీ ఆ తల్లిదండ్రులు విలపించడం చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. ఈ కేసులో, ఇటీవలే దివంగతులైన మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు, ఇంకొంతమంది కూడా ఉన్నారనీ, వారిని తప్పించేందుకే, పోలీసు లు సత్యం బాబు అనే అమాయకుడిని కేసులో ఇరికించారని మీడియా లో వస్తోంది.
నిజం ఏదైనా, సంపన్న వర్గాలు న్యాయ వ్యవస్థ ను ఎలాగూ నమ్మట్లేదు. వాళ్ళ లెక్కలు, సెటిల్మెంట్లు వేరేగా ఉంటున్నాయి. పేద ప్రజలు ఈ కోర్ట్ ఖర్చులు ఎలాగూ భరించలేరు. కుల పెద్దల పంచాయతీలతో వాళ్ళు సర్దుకుపోతున్నారు. ఇక మిగిలిన మధ్య తరగతి ప్రజలకు కూడా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయేలా పరిస్థితి ఉండడం దారుణం.
మీరేమంటారు,
కామెంట్స్ ప్లీజ్,
~ శశిధర్ సంగరాజు.
1 comment:
Completely agree with you! Judicial system, when it looks beyond the books and the so called evidences, it woudl be able to act differently!!When there is a Balipasuvu volunteering to be one, it amy be a tough task fro judiciary, but not an impossible one for prajashakthi..
Post a Comment