Powered By Blogger

Wednesday, March 16, 2011

పట్టుకుంటారా...వదిలేస్తారా?

ఇరానీ హోటల్ లో ఇద్దరు:
మొదటివ్యక్తి: తెలంగాణా ఉద్యమం, ట్యాంక్ బండ్ మీద విగ్రహాల ధ్వంసం, జగన్ పార్టీ, జపాన్ సునామీ   ఈ వార్తల్లో పడి ఈ మధ్య పట్టించుకోలేదు కానీ, భాను ఏమైయ్యాడ్రా?

రెండోవ్యక్తి: ఏ భాను?

మొదటివ్యక్తి: చూసావా, నువ్వుకూడా మర్చిపోయావ్!

రెండోవ్యక్తి: ఆ..ఆ...గుర్తొచ్చింది. మద్దులచెర్వు సూరి ని  హత్యచేసాడని అనుమానిస్తున్న భాను గురించేగా...అవున్రా.. ఏమైయ్యాడంటావ్?

మొదటివ్యక్తి: ఎక్కడో మన పొలీసు బాబాయిల ప్రతిభ చూసి నవ్వుకుంటూ ఉంటాడు.

రెండోవ్యక్తి: పాపం, సూరి పోయి వంద రోజులు దాటినట్లుంది.

మొదటివ్యక్తి: అవును. ఇదంతా చూస్తుంటే ఒక విషయం గుర్తుకొస్తోంది. మేము కాలేజ్ కు వెళ్ళే దారిలో ఒక గోడ మీద ఎవరో ఎర్ర అక్షరాలతో రాసారు "పోలీసుల్లారా! బుర్ర ఉన్నది టోపీ లు పెట్టుకోవడానికి కాదు. ఆలోచించడానికి" అని. అది నిజమనిపిస్తోంది.

రెండోవ్యక్తి:  ఏమోరా బాబు! చూస్తుంటే సూరి సంవత్సరీకానికైనా పట్టుకుంటారా? లేకపోతే,  వాడి పాపాన వాడే పోతాడని వదిలేస్తారా అనిపిస్తోంది.

~శశిధర్ సంగరాజు. 

No comments: