Powered By Blogger

Sunday, February 6, 2011

మనిషివా....చిరంజీవివా?

ఇరానీ హోటల్ లో ఇద్దరి సంభాషణ...

మొదటివాడు: ఏరా...వార్తలు ఫాలో అవుతున్నావా?
రెండోవాడు: అవుతున్నానులే...ఏం?
మొదటివాడు: పీఆర్పీ...కాంగ్రెస్...
రెండోవాడు: ఆ విషయం వదిలైయ్యరా బాబూ..కడుపులో దేవేసినట్లుంది.
మొదటివాడు:అదికాదురా..ఏంటీ దారుణం అని.
రెండోవాడు: అదంతే లేరా...సైడ్ కాల్వలన్నీ వెళ్లి మెయిన్ డ్రైనేజ్ లో కలవాల్సిందే.
మొదటివాడు:జనాలేమనుకుంటారో అని కూడా లేకుండా...
రెండోవాడు: జనాలేమనుకుంటారూ .. " మా చిరు వచ్చేసాడ్రా...అలాంటిలాంటి మార్పు కాదు....అవినీతిని  కడిగేస్తాడు...సామాజిక న్యాయం తెస్తాడు...చూస్తుండు" అని నిన్న మొన్నటి దాకా ఊగిపోయిన మా ఎదురింటి బాబాయి ...ఉదయాన్నే ఎవరినో తిడుతున్నాడు..."నువ్వు మనిషివా...చిరంజీవివా?" అని.
మొదటివాడు: ఖర్మ గాకపోతే...ఎందుకొచ్చిన దూల.కొన్ని రోజులు పోతే మెగాస్టార్ ను దగాస్టార్ అని కూడా అంటారేమో...


~శశిధర్ సంగరాజు.

4 comments:

RaPaLa said...

చాలా బావుంది.

చిలమకూరు విజయమోహన్ said...

సైడ్ కాల్వలన్నీ వెళ్లి మెయిన్ డ్రైనేజ్ లో కలవాల్సిందే.
ఈ మాట బాగుంది.

sarasabharthi.wordpress.com said...

sar, miru vrasina calam chaalaa bagundi.idi nijam.anni chotla andaru ilaage anukumtunnaru.

Sasidhar said...

@Rapala --
@Chilamakuru Vijaya Mohan --
@gabbita --

Thank you very much for the comments.
Let us see what happens to Chiranjeevi in near future.

~Sasidhar